Image | Name | Description | Price | Quantity | Add to cart |
| | ఆదినాథుడైన పరమశివుని నుండి ఉద్భవించినవే నాథ సాంప్రదాయము. దీనియందు నవనాథులు ప్రసిద్ధులు. వీరు వరుసగా మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు మొదలుగా గల తొమ్మిది మంది మహాసిద్ధులుగా ఉన్నారు. వీరి యోగము పతంజలిమహర్షి ప్రణీతమైన అష్టాంగయోగమునకు భిన్నమైన షష్టాంగయోగమని చెప్పబడుతుంది.
సిద్ధయోగసాధనా విధానములను వివరిస్తున్న ఈ అద్భుత గ్రంథమునకు నా వ్యాఖ్యానము యోగాభిమానులకు, సిద్ధయోగ సాధకులకు, సమస్త భారతీయులకు ఆనందమును కలిగిస్తుందని భావిస్తున్నాను.
Purchase eBook on
 | | | |
| | సూర్యోపాసకులు జపించే మంత్రాలలో 'మహాసౌరమ్' మొదటిస్థానంలో ఉంటుంది. రెండవది 'అరుణమ్'. మూడవది 'ఆదిత్యహృదయం'. మొదటి రెండూ వేదంలోనివి. మూడవది రామాయణం లోనిది.
'మహాసౌరమ్' అనేది ఋగ్వేదంలో ఉన్న 65 మహా ప్రభావవంతములైన సూర్యమంత్రముల సమాహారం. వీటిని పదముగ్గురు వేదఋషులు తమ తపస్సాధనలో దర్శించారు. వారి దర్శనములు ఋక్కులుగా వెలువడ్డాయి. ఈ ఋక్కులు (మంత్రములు) వేదంలో ఒకేచోట లేవు. చెదురుమదురుగా ఉన్నాయి. ఆ విధంగా ఋగ్వేదంలో ఉన్న 16 చోట్ల నుండి సేకరింపబడిన ఈ మంత్రములు 'మహాసౌర మంత్రపాఠమ్', 'మహాసౌరమ్' అనే పేర్లతో వేలాది ఏండ్లనుండి మన దేశంలోని సూర్యోపాసకులచేత జపింపబడుతున్నాయి.
Purchase paperback on

Purchase eBook on
 | | | |
| | బుద్ధుని ధ్యానమార్గమైన 'విపశ్యాన ధ్యానము' నకు ఇది ఒక గైడ్ బుక్ వంటిది. ఈ పుస్తకాన్ని శ్రద్ధగా చదివి అర్ధం చేసుకుంటే, బుద్ధుని ధ్యానమార్గం చక్కగా అర్ధమౌతుంది. ఆయన చేసిన సాధన ఏమిటో, ఆయన నడచిన దారి ఏమిటో, దానిలో మనం కూడా ఎలా నడవవచ్చో స్పష్టంగా అర్ధమౌతుంది.
మా ఇతర ప్రచురణల వలెనే, ఈ పుస్తకం కూడా మీ ఆదరణను పొందుతుందని, మీకు ఆధ్యాత్మికంగా గొప్ప మార్గదర్శి అవుతుందన్న విశ్వాసం మాకుంది.
Purchase paperback on

Purchase eBook on
 | | | |
| | యోగోపనిషత్తులలో ఇది అగ్రగణ్యమైనది. అందుకే దీనికి 'యోగశిఖ' అనే పేరు వచ్చింది. భగవద్గీతకూ దీనికీ పోలికలున్నాయి. భగవద్గీత ఎలాగైతే తన పద్దెనిమిది అధ్యాయములలో పద్దెనిమిది విభిన్నములైన సాధనామార్గములను వివరించిందో, అదే విధంగా, ఈ గ్రంధంకూడా తన ఆరు అధ్యాయములలో ఆరు సాధనామార్గములను చెప్పింది. సిద్ధయోగమునకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చిన ఈ గ్రంధం, కుండలినీయోగమును, అద్వైతసాంప్రదాయమును, యోగసాధనలోని అనేక అంశములను ఒకేచోట వివరించే ప్రయత్నాన్ని చేసింది. అందుకనే ఈ గ్రంధం యోగశాస్త్రములలో తలమానికమని పండితుల అభిప్రాయం.
ఈ గ్రంధం ఇప్పటిది కాదు. రెండువేల ఏళ్ళ క్రితం వ్రాయబడిన గ్రంథమిది. దీనికి నేను వ్యాఖ్యానం వ్రాయగలగడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం, నా గురుదేవుల అనుగ్రహం.
Purchase paperback on

Purchase eBook on
 | | | |
| | దీనిలో 5 అధ్యాయములు, 247 శ్లోకములున్నాయి. బ్రహ్మమానసపుత్రుడైన ఋభుమహర్షి చేసిన తపస్సు గురించి, ఆయన పొందిన బ్రహ్మజ్ఞానమును గురించి, పులస్త్యబ్రహ్మ కుమారుడైన నిదాఘునికి ఆయన గురువై జ్ఞానబోధ చేసిన వృత్తాంతమంతా ఈ ఉపనిషత్తులో ఉన్నది గనుక ఇది అతి ప్రాచీనమైనదే గాని, బాగా తరువాతి కాలంలో గ్రంథస్థం చేయబడినదని అర్థమౌతున్నది. దీనిలోని అనేక విషయములు దాదాపు రెండువేల సంవత్సరముల నాటివి. కానీ ఇది వ్రాయబడినది మాత్రం దాదాపుగా 13 శతాబ్దం ప్రాంతమని పండితుల అభిప్రాయం.
Purchase paperback on

Purchase eBook on
 | | | |
| | మానవజీవితానికి పరిపూర్ణత ఎలా వస్తుంది? దానికి ఏమేం చెయ్యాలి? అనేది మాత్రమే గాక, సృష్టి ఏ విధమైన ప్రణాళికతో జరిగింది అనే విషయాన్ని బ్రహ్మాండం నుండి పిండాండం వరకూ కూలంకషంగా వివరించడం జరిగింది.
Purchase paperback on

Purchase eBook on
 | | | |
| | విజ్ఞాన భైరవ తంత్రమన్నది భైరవాగమము నందు గల రుద్రయామళ తంత్రమునందొక భాగము. ఇది జ్ఞానతంత్రము. అనగా, భౌతికములైన తంతులతో సంబంధము లేని ధారణా విధానములు దీనిలో చెప్పబడినవి. నూట పన్నెండు పైగా ధారణా విభాగములు దీనిలో ఉన్నవి. నేడు ప్రపంచమంతటా గురువులు భోధించుచున్నవి, ఉపాసకులు చేయుచున్నవి అయిన సాధనలన్నియు ఈ తంత్రమున లభిస్తాయి.
Purchase paperback on

Purchase eBook on
 | | | |
| | స్వరశాస్త్రమనే ఈ ప్రాచీనగ్రంథము తంత్రశాస్త్రమునకు చెందినది. తంత్రములన్నియు పరమశివుని చేత దేవికి చెప్పబడినవి. ఈ గ్రంథములో స్వరములు వాటి తత్త్వములు, దశనాడులు, దశవాయువులు, నిత్యజీవితంలో ఈ శాస్త్రము యొక్క ఉపయోగము, ప్రశ్నశాస్త్రములో దీనిని ఉపయోగించి వివిధ ఫలితములను తెలుసుకునే విధానములు, సంవత్సర, మాస, దినఫలితములు, వాతావరణ పరిశీలన, పంటలు, స్త్రీ వశీకరణము, సంతానము, రోగములు నిర్ధారణ, మరణసమయము, ఛాయాపురుష సాధన, కుండలినీ యోగము మొదలైన అనేక విషయములు వివరింపబడినవి.
‘పంచవటి’ నుండి వెలువడుచున్న 61వ గ్రంథముగా దీనిని విడుదల చేయుచున్నాము.
Purchase eBook on
 | | | |
| | 16-17 శతాబ్దముల మధ్యలో తమిళనాడులో జీవించిన శ్రీ సదాశివేంద్రసరస్వతీస్వామికే సదాశివయోగీంద్రుడనిన నామాంతరమున్నది. మహాయోగి మరియు బ్రహ్మజ్ఞానియైన ఈయన, శ్రీపరమశివేంద్రసరస్వతీస్వామి శిష్యుడు. ఈయన కంచి కామకోటి పీఠమునకు 58 వ ఆచార్యునిగా ఉన్నారు. సదాశివయోగీంద్రుల గురించిన అనేక మహిమలు మరియు గాథలు దక్షిణాదిలో ప్రచారంలో ఉన్నాయి. అనేక భక్తికీర్తనలను, వేదాంతగ్రంథములను ఈయన రచించారు. వాటిలోని ఒకటి భక్తి, మంత్ర, లయ, హఠ, రాజ, జ్ఞానయోగముల మేలు కలయిక అయిన ఈ గ్రంథము. ఎన్నో సాధనల సమాహారంగా ఈ గ్రంథం గోచరిస్తుంది. పంచవటి నుండి వెలువడుతున్న 70 వ గ్రంథముగా దీనిని పాఠకులకు అందిస్తున్నాము.
Purchase eBook on
 | | | |
| | 16-17 శతాబ్దములలో తమిళనాడులో నివసించిన శ్రీ సదాశివేంద్రసరస్వతీ స్వామికే సదాశివయోగీంద్రుడనిన నామాంతరమున్నది. మహాయోగి మరియు బ్రహ్మజ్ఞానియైన ఈయన, కంచి కామకోటిపీఠమునకు 58 వ ఆచార్యులైన శ్రీపరమశివేంద్రసరస్వతీస్వామి యొక్క శిష్యుడు. అనేక మహిమలు మరియు గాధలు ఈయన పేరుమీద దక్షిణాదిలో ప్రచారంలో ఉన్నాయి. అనేక భక్తికీర్తనలను, వేదాంతగ్రంథములను ఈయన రచించారు. ఆత్మజ్ఞానియైన అవధూత యొక్క స్థితిని వివరించే గ్రంధం ఇది. ముముక్షువులైనవారికి ఈ గ్రంధము నిత్యపారాయణాగ్రంధం మాత్రమే కాదు, నిత్య ధ్యానగ్రంధం కావాలి. పంచవటి నుండి వెలువడుతున్న 72 వ గ్రంథముగా దీనిని పాఠకులకు అందిస్తున్నాము.
Purchase eBook on
 | | | |