Image | Name | Description | Price | Quantity | Add to cart |
| | అవధూతకులేశ్వరుడగు దత్తాత్రేయులవారిచేత, జమదగ్నిసుతుడగు పరశురామునకు బోధింపబడిన పరాశక్తితత్త్వమే త్రిపురారహస్యమను ఈ ప్రాచీనగ్రంథము. ఇది పరశురాముని శిష్యుడగు హరితాయనఋషి చేత గ్రంథస్థము చేయబడినది. శాక్తాద్వైత సాంప్రదాయములోని జ్ఞానపరాకాష్టయొక్క స్థితులు దీనిలో అద్భుతముగా వివరింపబడినవి. మహాజ్ఞానియగు రమణమహర్షి ఈ గ్రంథమును ఎక్కువగా ఇష్టపడేవారు. జ్ఞానాన్వేషులకు ఈ గ్రంథము అత్యావశ్యకమైనది.
Purchase eBook on
 | | | |
| | 'పిట్టకొంచం కూత ఘనం' అన్నట్లు, భావవిస్తృతిలో చాలా పెద్దది. హఠయోగాన్నీ రాజయోగాన్నీ వాటి సారాన్ని పిండి, అతి తక్కువ శ్లోకములలో చెప్పడం ఆచార్యులవారికే చెల్లింది. ఇంకొకరైతే ఈ పనిని చెయ్యలేరు.
Purchase paperback on

Purchase eBook on
 | | | |
| | నాదోపాసన అనేది మన సనాతనధర్మంలో అంతర్భాగంగా అతి ప్రాచీనకాలంనుంచీ ఉన్నది. ఋగ్వేదకాలంలో ప్రసిద్ధిగాంచిన ఓంకారోపాసన నాదోపాసనయే. నాదమనేది పరబ్రహ్మం యొక్క మొదటి వ్యక్తరూపంగా వేదం చెబుతుంది. భగవంతుని మొదటిపేరును, మనమెవరూ ఆయనకు పేర్లు పెట్టకముందు ఉన్న అసలైన పేరును - 'తస్య వాచక ప్రణవ:' అంటూ ప్రణవనాదంగా అభివర్ణించారు పతంజలిమహర్షి . ఈ ఓంకార ప్రణవనాదం సృష్టిలో నిరంతరం మారుమ్రోగుతూనే ఉన్నది. కానీ విషయలంపటాలలో కూరుకుపోయిన మనం ఆ నిరంతరనాదాన్ని వినలేము. దైవాన్ని దర్శించలేము. కానీ సాధనతో దానిని వినవచ్చు. దర్శనాన్ని పొందవచ్చు. ఆ సాధన పేరే నాదోపాసన.
Purchase eBook on
 | | | |
| | పేరుకు తగినట్లే, ఈ ఉపనిషత్తు ధ్యానమునకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నది. యధావిధిగా ఇందులో కూడా షట్చక్రములు, బంధములు, ప్రాణాయామక్రియలు, గ్రంధిభేదనం, ఓంకారనాదోపాసన, నాడీచక్రం, హృదయపద్మంలో ఆత్మ సంచారంతో ఏయే భావములు ఎప్పుడు పుడుతూ ఉంటాయి? జాగ్రత్ స్వప్న సుషుప్తి, తురీయ, తురీయాతీత స్థితులను ఆత్మ ఎలా అందుకుంటుంది? ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మానుభవం మొదలైన విషయములు వివరించబడి వాటికి దారులు సూచింపబడినాయి.
Purchase eBook on
| | | |
| | గాయత్రీమంత్రము ఋగ్వేదం (3.62.10) లో మనకు లభిస్తున్నది. సూర్యునిద్వారా లోకమును పోషిస్తున్నది గనుక, సావిత్రీమంత్రమని కూడా దీనికి పేరున్నది. వైదికసాంప్రదాయములో ఎన్నో మంత్రములున్నప్పటికీ, గాయత్రిని మించిన మంత్రం లేదన్నది ప్రసిద్ధి. గానం (జపం) చేసేవాడిని రక్షించే దేవతగా గాయత్రికి పేరున్నది. గాయత్రియంటే ప్రత్యేకమైన దేవత కాదు. పరబ్రహ్మమునకు సాకారరూపమే గాయత్రి. ఈ దేవతకు సంబంధించిన వాఙ్మయంలో ఈ ‘గాయత్రీ రహస్యోపనిషత్తు’ ఒకటి. గాయత్రీమంత్రోపాసకులకు ఈ గ్రంథము చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నది నిశ్చయము. మా ఈ వ్యాఖ్యానము, జిజ్ఞాసువులను సాధనోన్ముఖులను గావిస్తే, మా ప్రయత్నం సఫలమైనదని భావిస్తాము.
Purchase eBook on
 | | | |
| | శ్రీ దత్తాత్రేయ యోగ శాస్త్రమను ఈ గ్రంథం వ్రాయబడిన కాలము ఎప్పటిదో తెలియదు. కానీ ఆ కాలమున ఉన్నట్టి వివిధ యోగ సాంప్రదాయములను ఒకచోట వివరించే ప్రయత్నం ఈ గ్రంథమున మనకు దర్శనమిస్తుంది. ఈ క్రమమున దీనియందు హఠ, లయ, మంత్ర, రాజయోగముల లఘు వివరణ ఇవ్వబడినది. వీనిలో హఠయోగమునకు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వబడినది. దీనియందు సాంకృతియను యోగినుద్దేశించి దత్తాత్రేయులు చెప్పినట్లుగా అనేక యోగ రహస్యములు ఇవ్వబడినవి.
Purchase paperback on

Purchase eBook on
 | | | |
| | The science of Yoga according to Lord Dattatreya is a compendium of the Yogic practices followed during the ancient times. This book is in the form of a dialogue between Lord Dattatreya and a seeker named Sankriti. A brief description of different paths viz.; Hatha, Laya, Mantra and Raja Yoga is given in this book. However the practices of Hatha Yoga are emphasized more.
Purchase paperback on

Purchase eBook on
 | | | |
| | వేదములకు అనుబంధములైన అనేక చిన్న ఉపనిషత్తులలో 'యోగ కుండలిని ఉపనిషత్' ఒకటి. దీనికి 'యోగకుండల్యుపనిషత్' అని నామాంతరమున్నది. ఇందులో 3 అధ్యాయములు, 171 శ్లోకములున్నాయి. ఇది కృష్ణయజుర్వేదమునకు చెందిన ఉపనిషత్తు. దీనియందు కుండలినీ తంత్రము, ఖేచరీవిద్య చెప్పబడినవి.
Purchase paperback on

Purchase eBook on
 | | | |
| | ‘శ్రీరామగీత’ యనిన పేరును బట్టి ఇది సాక్షాత్తు శ్రీరామునిచేత చెప్పబడిన బోధయని మనకు అర్థమౌతుంది. వ్యాసమహర్షి చేత రచింపబడిన బ్రహ్మాండపురాణంలోని ఆధ్యాత్మరామాయణమనేది ఉమామహేశ్వర సంవాదరూపంలో ఉంటుంది. శ్రీరాముని దివ్యచరిత్రను గురించి పార్వతీదేవి అడుగగా, ఆ చరిత్రలోని ఆధ్యాత్మికములైన అర్థములను, లోతుపాతులను, పరమేశ్వరుడు ఆమెకు వివరించినదే ఆధ్యాత్మరామాయణము. ఇది వేదవేదాంతముల సారమైన బోధగా మనకు గోచరిస్తుంది.
‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ నుండి వెలువడుతున్న 55 వ పుస్తకముగా దీనిని అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రం నుండి విడుదల చేస్తున్నాము.
Purchase eBook on
 | | | |
| | భగవద్గీతలో 700 శ్లోకములున్నప్పటికీ ఘంటసాల గారు పాడినవి, వారికి ముఖ్యములనిపించిన 108 శ్లోకములకు 158 కందపద్యములను రచయిత్రి శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయిగారు తెలుగులో చక్కగా వ్రాసినారు.
లౌకిక విషయములపైన పద్యములను చెప్పడం సాధారణమైతే, ఉన్నతభావములతో కూడిన ఆధ్యాత్మిక విషయములపైన చెప్పడం సమున్నతం. అందులోను ‘భగవతా నారాయణేన స్వయం’ సాక్షాత్తు భగవంతుడైన నారాయణునిచే చెప్పబడిన గీతాశాస్త్రశ్లోకములను పద్యరూపంలో తెనిగించడం మహోన్నతం.
గీతలోని శ్లోకముల యొక్క భావమును పద్యరూపములోనికి తెచ్చుటలో రచయిత్రి సఫలీకృతురాలైనది. మరందసమములైన ఆయా పద్యములను ఆస్వాదించినపుడు చదువరులు దీనిని గ్రహించగలుగుతారు.
Purchase eBook on
 | | | |