16-17 శతాబ్దములలో తమిళనాడులో నివసించిన శ్రీ సదాశివేంద్రసరస్వతీ స్వామికే సదాశివయోగీంద్రుడనిన నామాంతరమున్నది. మహాయోగి మరియు బ్రహ్మజ్ఞానియైన ఈయన, కంచి కామకోటిపీఠమునకు 58 వ ఆచార్యులైన శ్రీపరమశివేంద్రసరస్వతీస్వామి యొక్క శిష్యుడు. అనేక మహిమలు మరియు గాధలు ఈయన పేరుమీద దక్షిణాదిలో ప్రచారంలో ఉన్నాయి. అనేక భక్తికీర్తనలను, వేదాంతగ్రంథములను ఈయన రచించారు. ఆత్మజ్ఞానియైన అవధూత యొక్క స్థితిని వివరించే గ్రంధం ఇది. ముముక్షువులైనవారికి ఈ గ్రంధము నిత్యపారాయణాగ్రంధం మాత్రమే కాదు, నిత్య ధ్యానగ్రంధం కావాలి. పంచవటి నుండి వెలువడుతున్న 72 వ గ్రంథముగా దీనిని పాఠకులకు అందిస్తున్నాము.
Atma Vidya Vilasamu
16-17 శతాబ్దములలో తమిళనాడులో నివసించిన శ్రీ సదాశివేంద్రసరస్వతీ స్వామికే సదాశివయోగీంద్రుడనిన నామాంతరమున్నది. మహాయోగి మరియు బ్రహ్మజ్ఞానియైన ఈయన, కంచి కామకోటిపీఠమునకు 58 వ ఆచార్యులైన శ్రీపరమశివేంద్రసరస్వతీస్వామి యొక్క శిష్యుడు. అనేక మహిమలు మరియు గాధలు ఈయన పేరుమీద దక్షిణాదిలో ప్రచారంలో ఉన్నాయి. అనేక భక్తికీర్తనలను, వేదాంతగ్రంథములను ఈయన రచించారు. ఆత్మజ్ఞానియైన అవధూత యొక్క స్థితిని వివరించే గ్రంధం ఇది. ముముక్షువులైనవారికి ఈ గ్రంధము నిత్యపారాయణాగ్రంధం మాత్రమే కాదు, నిత్య ధ్యానగ్రంధం కావాలి. పంచవటి నుండి వెలువడుతున్న 72 వ గ్రంథముగా దీనిని పాఠకులకు అందిస్తున్నాము.