శాండిల్యోపనిషత్

 150.00

శాండిల్యమహర్షి పేరు మీద ఈ ఉపనిషత్తు మనకు దర్శనమిస్తుంది. శాండిల్యగోత్రం మనకు ఉత్తరభారతదేశంలోనూ, గోదావరిజిల్లాల లోనూ కనిపిస్తుంది. ఇది అథర్వణ వేదమునకు చెందిన ఉపనిషత్తు. ఇది క్రీ.పూ 1 వ శతాబ్దానికి చెందినదిగా కొందరు పండితులు నిర్ధారించారు. కొందరేమో క్రీ.శ 3 వ శతాబ్దమన్నారు. పతంజలిమహర్షి వ్రాసిన యోగసూత్రముల పైన బుద్ధమతప్రభావం కనిపిస్తుంది. కానీ శాండిల్య యోగసూత్రములలో ఆ ప్రభావం ఉండదు. ఇది పూర్తిగా వైదిక సాంప్రదాయానుసారిగా గోచరిస్తుంది. యోగమునూ, బ్రహ్మవిద్యనూ అధ్యయనం చెయ్యాలన్న ఇచ్ఛతో శాండిల్య మహర్షి, అథర్వణమహర్షిని ఆశ్రయించి ఆయన వద్ద పొందిన ఉపదేశమే ఈ ఉపనిషత్తు. యోగసాంప్రదాయం పైన ఇది సాధికారిక గ్రంథమని చెప్పవచ్చు.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

Availability: 10 in stock

SKU: PSF-2020-04-27-TE-P1 Category: Tags: , , ,

శాండిల్యోపనిషత్. దీనికి శాండిల్యయోగసూత్రములని నామాంతరమున్నది. చాలామందికి తెలియని విషయమేమిటంటే, పతంజలిమహర్షి వ్రాసిన యోగసూత్రములకంటే శాండిల్యమహర్షి యోగ సూత్రములే సనాతనధర్మమునకు దగ్గరగా ఉంటాయి.

శాండిల్యమహర్షి పేరు మీద ఈ ఉపనిషత్తు మనకు దర్శనమిస్తుంది. శాండిల్యగోత్రం మనకు ఉత్తరభారతదేశంలోనూ, గోదావరిజిల్లాల లోనూ కనిపిస్తుంది. ఇది అథర్వణ వేదమునకు చెందిన ఉపనిషత్తు. ఇది క్రీ.పూ 1 వ శతాబ్దానికి చెందినదిగా కొందరు పండితులు నిర్ధారించారు. కొందరేమో క్రీ.శ 3 వ శతాబ్దమన్నారు. పతంజలిమహర్షి వ్రాసిన యోగసూత్రముల పైన బుద్ధమతప్రభావం కనిపిస్తుంది. కానీ శాండిల్య యోగసూత్రములలో ఆ ప్రభావం ఉండదు. ఇది పూర్తిగా వైదిక సాంప్రదాయానుసారిగా గోచరిస్తుంది. యోగమునూ, బ్రహ్మవిద్యనూ అధ్యయనం చెయ్యాలన్న ఇచ్ఛతో శాండిల్య మహర్షి, అథర్వణమహర్షిని ఆశ్రయించి ఆయన వద్ద పొందిన ఉపదేశమే ఈ ఉపనిషత్తు. యోగసాంప్రదాయం పైన ఇది సాధికారిక గ్రంథమని చెప్పవచ్చు.

పతంజలిమహర్షి చెప్పిన యమనియమములకూ, ఈ ఉపనిషత్తులు చెప్పిన బోధలకూ భేదములున్నాయి. ఉపనిషద్బోధలు పూర్తిగా వైదిక సాంప్రదాయానుసారులుగా కనిపిస్తున్నాయి.  ఈ ఉపనిషత్తును మొత్తం ఒకే ఒక శ్లోకంలో ఇమిడ్చి ఈ విధంగా చెప్పబడింది.

|తత్ర దశ యమాః | తథా నియమాః | ఆసనాన్యష్టౌ | త్రయః ప్రాణాయామాః | పఞ్చ ప్రత్యాహారాః | తథా ధారణా | ద్విప్రకారం ధ్యానమ్ | సమాధిస్త్వేకరూపః |

యమములో పది అంగములున్నాయి. అలాంటిదే నియమం కూడా. ఆసనములు ఎనిమిది. ప్రాణాయామములు మూడు. ప్రత్యాహారములు అయిదు. ధారణ కూడా అలాంటిదే. ధ్యానం రెండు విధములైనది. సమాధి ఏక రూపమైనట్టిది.

వైదికధర్మం మొదట నిర్గుణ పరబ్రహ్మతత్త్వంతో మొదలుపెట్టి, క్రమేణా సగుణోపాసనగా రూపాంతరం చెందుతూ తదుపరి భగవంతుని అవతారములను ఆరాధించడం ఏ విధంగా మొదలుపెట్టిందో ఆ పరిణామక్రమం ఈ ఉపనిషత్తు చివరి అధ్యాయములో మనకు కనిపిస్తుంది. నిర్గుణపరబ్రహ్మమే దత్తాత్రేయునిగా అవతారం దాల్చిందని చెబుతూ ఈ ఉపనిషత్ ముగుస్తుంది.